భట్టి కృషితో సీఎం సహాయ నిధి చెక్కులు మంజూరి
Published: Friday September 24, 2021
ఎర్రుపాలెం, సెప్టెంబర్ 23, ప్రజాపాలన ప్రతినిధి : ఎర్రుపాలెం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన ఆరుగురు లబ్ధిదారులకు CLP లీడర్ భట్టివిక్రమార్క కృషి తో ముఖ్యమంత్రి సహాయనిది నుండి ఆర్థికసహాయం కింద సహాయనిది చెక్కులు మంజూరీ చేయించారు. ఈరోజు మండల కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో మండల కాంగ్రెస్ అద్యక్షులు వేమిరెడ్డి సుధాకర్ రెడ్డి చేతులమీదగా లబ్ధిదారులకు చెక్కులు అందచేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు బండారు నరసింహారావు, PACS ఉపాధ్యక్షులు కడియం శ్రీనివాసరావు, షేక్ జనిభాషా, నాయకులు షేక్ ఇస్మాయిల్, దేవరకొండ శ్రీను, పిల్లి బోస్ బాబు, టి మెరిచెన్నయ్య, యెస్ రాజేష్ డీ వేడుకొండలు, రోసియ్య తదితరులు పాల్గొన్నారు. లబ్ధిదారులకు, కొండలరావు సి ఎహ్ ఇనగాలి 39000/. శ్రీనివాసరావు. వి ఎర్రుపాలెం 16500/. రామయ్య యూ వెంకటాపురం 6000/. వెంకట నారాయణ జిమామునూరు 9000/. నాగేశ్వరరావు ఎమ్ ఎర్రుపాలెం 9500/. నాగమణి జి ఎర్రుపాలెం 16500/.
Share this on your social network: