కరోనా రోగులకు నిత్యావసర సరుకులు పంపిణీ

Published: Monday May 24, 2021
రాయికల్, మే 23 (ప్రజాపాలన ప్రతినిధి) : రాయికల్ మండలం కొత్తపేట గ్రామంలో గల నిరుపేద కుటుంబాలు కరోన వైరస్ తో బాధపడుతూ బయటకు రాలేని విపత్కర పరిస్థితుల్లో ఉండగా  రాయికల్ పట్టణానికి చెందిన పాత్రికేయుడు కడకుంట్ల జగదీశ్వర్ మానవత్వంతో స్పందించి ఆదివారం ఐదు కుటుంబాలకు నిత్యావసర సరుకులు బియ్యం నూనె, సబ్బులు, మాస్క్లు సాని టేజర్, కురగాయలు తదితర నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎద్దండి ముత్యంపు రాజు రెడ్డి, చింత కుంట సాయికుమార్, కళ్లెం శ్రీనివాస్, చెలిమేల మల్లేశం తదితరులు పాల్గొన్నారు.