సునీల్ ఆఫీస్ పై దాడులకి వ్యతిరేకంగా కెసిఆర్ దిష్టి బొమ్మ దగ్ధం..

Published: Thursday December 15, 2022
పాలేరు డిసెంబర్ 14 ప్రజాపాలన ప్రతినిధి
నేలకొండపల్లి మండల కేంద్రంలో పాలేరు కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ కన్వీనర్ బచ్చలకూరి నాగరాజు, ఆధ్వర్యంలో కేసీఆర్. దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది గత రాత్రి మంగళవారం  హైదరాబాద్ లోని కాంగ్రెస్ పార్టీ సలహాదారు సునీల్ , ఆఫీసు నందు ముందుగా ఎటువంటి సమాచారం లేకుండా ఆకస్మిక దాడులు జరిపి పార్టీ కార్యాలయంలో కంప్యూటర్ మరియు ఫర్నిచర్ ను ధ్వంసం చేసి ఆఫీసును సీజ్ చేసినందుకు నిరసనగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది..
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతు..
నాయకులు టిఆర్ఎస్ కి తెలంగాణ పోలీస్ వ్యవస్థ అధికార పార్టీ టిఆర్ఎస్ నాయకులకు తొత్తులగా పనిచేస్తు కాంగ్రెస్ పార్టీ నాయకులపై ఆఫీసులపై దాడులను ఖండిస్తున్నాం ఇలాంటి ఘటనలు మళ్లీ చోటుచేసుకున్నచో కెసిఆర్ ప్రభుత్వం తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటుంది కాంగ్రెస్ పార్టీ ఏ పిలుపు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరారు ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు బొడ్డు బొందయ్య,  బోయిన వేణు, భూక్య చిన్న నాయక్,  మామిడి వెంకన్న, గుడిబోయిన వెంకటేశ్వర్లు,తదితరులు పాల్గొన్నారు