రాష్ట్రం నుండి ధాన్యం సేకరించనందుకు నిరసనగా ఎర్రుపాలెంలో మోడీ దిష్టిబొమ్మ దగ్ధం.....

Published: Tuesday December 21, 2021
ఎర్రుపాలెం డిసెంబర్ 20 ప్రజాపాలన ప్రతినిధి: యాసంగి వరి ధాన్యం కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వ వైఖరికి ఎర్రుపాలెం మండల రింగ్ సెంటర్ నందు ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దహనం చేయడం మరియు రైతు చట్టాలు పై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను వ్యతిరేకిస్తూ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో మధిర మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రామకృష్ణ, ఎంపీపీ శ్రీమతి దేవరకొండ శిరీష, జెడ్ పి టి సి శీలం కవిత, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు సాంబశివరావు, సర్పంచులు మొగిలి అప్పారావు గారు శివాజీ, భాస్కర్ రెడ్డి, వైస్ ఎంపీపీ రామ కోటేశ్వర రావు, ఎంపీటీసీ కిషోర్, మీనవోలు సొసైటీ చైర్మన్ మధుసూదన్ రెడ్డి, ఎర్రుపాలెం టౌన్ ప్రెసిడెంట్ చిన్నo రాము, బీసీ సెల్ మరియు ఎస్సీ సెల్ మరియు మైనార్టీ సెల్ అధ్యక్షులు నాగేశ్వరావు, భాస్కర్ రావు, బాజీ, టిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు సాంబశివరావు, తిరుపతి రావు, నారాయణ, నండ్రు రవి, దేవరకొండ రవి, చిరంజీవి మరియు టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.