భట్టి పాదయాత్రలో పాల్గొన గాంధీ పదం కన్వీనర్, వైస్ ఎంపీపీ
Published: Monday March 07, 2022
బోనకల్, మార్చి 6 ప్రజాపాలన ప్రతినిధి: తెలంగాణ సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర కు బోనకల్ మండల పరిషత్ ఉపాధ్యక్షుడు గుగులోత్ రమేష్, మధిర నియోజకవర్గ గాంధీ పదం కన్వీనర్ పి కోటేశ్వరరావు శనివారం ముదిగొండ మండలం పెద్దమండవ గ్రామంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేస్తున్న పాదయాత్రలో పాల్గొని బోనకల్ మండలం లో ఉన్న పలు సమస్యలు వృద్ధాప్య పెన్షన్లు, వితంతు కొత్త పెన్షన్లు, డబల్ బెడ్రూమ్ ఇల్లు రాక ఇబ్బందులు పడుతున్న సామాన్య ప్రజలు, రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని, అదేవిధంగా బోనకల్ ఆర్ ఓ బి బ్రిడ్జి క్రింద గత కొన్ని సంవత్సరాలుగా బడ్డీ కొట్లు పెట్టుకొని జీవనం సాగిస్తున్న చిరు వ్యాపారుల సమస్యలను సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క దృష్టి కి తీసుకువెళ్లి వారి సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని వారిని కోరారు. ఈ కార్యక్రమంలో బోనకల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ,కార్యకర్తలు పాల్గొన్నారు.
Share this on your social network: