సీఎంఆర్ఎఫ్, రైతు బీమా చెక్కులు పంపిణీ చేసిన జడ్పీ చైర్మన్

Published: Wednesday January 25, 2023
బోనకల్, జనవరి 24 ప్రజా పాలన ప్రతినిధి: మండల కేంద్రం లో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సిఫారసు తో, జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు చొరవతో మంజూరైన 5,00,000/- లక్షల రూపాయల విలువ చేసే 11 సీఎంఆర్ఎఫ్ చెక్కులను మంగళవారం జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు పంపిణీ చేశారు.
అనంతరం గ్రామంలో మరీదు వేంకటేశ్వర్లు ఇటీవల మరణించడంతో వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అదేవిధంగా బోనకల్ గ్రామంలో గుగులోత్ సైదా ఇటీవల మరణించడంతో వారికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'రైతు బీమా' పథకం ద్వారా మంజూరైన 5,00,000/లక్షల రూపాయల చెక్ ను వారి కుటుంబానికి అందజేసివారి చిత్రపటానికి పూలమాలతో నివాళులర్పించి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల అధ్యక్షులు చేబ్రోలు మల్లికార్జునరావు, కార్యదర్శి మోదుగుల నాగేశ్వరరావు, మాజీ అధ్యక్షులు బంధం శ్రీనివాసరావు, మాజీ జెడ్పిటిసి బానోత్ కొండ, మండల రైతు కన్వీనర్ వేమూరి ప్రసాద్, రావినూతల సర్పంచ్ కొమ్మినేని ఉపేందర్, బోనకల్ సహకార సంఘం అధ్యక్షులు చావా వెంకటేశ్వరరావు, బీఆర్ఎస్ బోనకల్ గ్రామ అధ్యక్షులు గుండపనేని సుధాకర్ రావు, బోనకల్ మాజీ సర్పంచ్ పోటు వెంకటేశ్వర్లు, మాజీ సహకార సంఘం అధ్యక్షులు యార్లగడ్డ చిన్న నరసింహ, గ్రామ రైతు కన్వీనర్ మోర్ల నరసింహారావు, మోర్ల శ్రీను, యార్లగడ్డ రమేష్ ,వివిధ హోదాల్లో ఉన్న ప్రజాప్రతినిధులు బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.