టిఆర్ఎస్ సభను జయప్రదం చేయాలీ

Published: Friday October 01, 2021
బోనకల్: ప్రజాపాలన ప్రతినిధి 30సెప్టెంబర్అక్టోబర్ మూడో తేదీన మధిర లో జరిగే టిఆర్ఎస్ సభను జయప్రదం చేయాలని పార్టీ ఆధ్వర్యంలో పార్టీ నిర్మాణ కార్యక్రమంలో భాగంగా ఏర్పడిన నూతన మండల కమిటీలు మండల ప్రజా సంఘ కమిటీలు గ్రామ కమిటీలు గ్రామ ప్రజా సంఘ కమిటీలు ప్రమాణ స్వీకారం కార్యక్రమం కలదు. ఈ కార్యక్రమానికి జిల్లా రాష్ట్ర రవాణా శాఖ మాత్యులు పువ్వాడ అజయ్ కుమార్,రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ శ్రీ కొండబాల కోటేశ్వరరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూకల నరేష్ రెడ్డి, మధిర నియోజవర్గ ఇన్చార్జి ఖమ్మం జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు, మరియు జిల్లా నాయకులు పాల్గొంటారు. కావున మండలంలోని టిఆర్ఎస్ పార్టీ నూతనంగా ఏర్పడిన కమిటీ మండల కమిటీ ప్రజాసంఘాల కమిటీ గ్రామ కమిటీలు అందరూ పాల్గొనవలసిందిగా కోరుతున్నాము. ఈ సమావేశంలో మండల పార్టీ అధ్యక్షులు మల్లికార్జున రావు, మాజీ పార్టీ అధ్యక్షులు బంధం శ్రీనివాసరావు, రావినూతల సర్పంచ్ కొమ్మినేని ఉపేంద్ర, మండల ఆర్గనైజింగ్ కార్యదర్శి చావా హనుమంతరావు, మండల సంయుక్త కార్యదర్శి సయ్యద్ మదర్ సాహెబ్, దుగ్గిబోయిన నాగయ్య, మైనార్టీ మండలాధ్యక్షులు షేక్ ఇబ్రహీం, మండల కార్మిక శాఖ అధ్యక్షులు బంధం నాగేశ్వరావు, మండల పార్టీ నాయకులు దారగాని నారాయణ, రైతుబంధు మండల కమిటీ సభ్యులు కొమ్మినేని సత్యనారాయణ, మైనార్టీ మండల నాయకులు షేక్ సైదా, ప్రచార కార్యదర్శి షేక్ పెంటు సాహెబ్, ముష్టికుంట్ల గ్రామ అధ్యక్షుడు దుప్ప కృష్ణ,రామాపురం గ్రామ అధ్యక్షులు బంధం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.