అభివృద్ది పనులు ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ ఈసంపల్లి ప్రభాకర్

Published: Wednesday May 19, 2021

మంచిర్యల, మే18, ప్రజాపాలన ప్రతినిధి : నస్పుర్ మున్సిపాలిటీ పరిదిలోని 17వ వార్డు లో అభివృద్ధి పనులను ఆ వార్డు కౌన్సిలర్ మేకల దాసు తో కలసి మున్సిపల్ చైర్మన్ ఈసంపల్లి ప్రభాకర్ మంగళవారం ప్రారంబించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 17 వ వార్డులో 3 లక్షల 50 వేల నిధులతో 126 మీటర్ల పొడవు సీసీ డ్రైన్ పనులు చేపట్టినట్లు తెలిపారు. అదేవిధంగా ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు పూర్తిగా వినియోగించనున్నట్లు తెలిపారు. త్వరలో 19 లక్షల 50 వేలతో  సిసి రోడ్ల నిర్మాణ పనులు ప్రారంభించనున్నట్లు తెలిపారు. నస్పూర్ మున్సిపాలిటీని అభివృద్ధి పదంలో నడిపిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వేల్పుల రవి. నారాయణ, జక్కన రాజేందర్ సాగర్, ప్రసాద్, శ్రీనివాస్, రాజు, రాజేశం తదితరులు పాల్గొన్నారు.