ఎస్ఆర్ఎస్పీ అధికారులతో ఎమ్మేల్యే క్వార్టర్స్ లో సమీక్ష సమావేశం ఎమ్మేల్యే డా సంజయ్

Published: Saturday December 17, 2022

జగిత్యాల, డిసెంబర్ 16 (ప్రజాపాలన ప్రతినిధి): ఎస్ఆర్ఎస్పీ  అధికారులతో ఎమ్మేల్యే క్వార్టర్స్ లో సమీక్ష సమావేశం  ఎమ్మేల్యే డా సంజయ్ కుమార్ నిర్వహించినారు. జగిత్యాల నియోజకవర్గ పరిధిలో ఎస్ ఆర్ ఎస్పీ నీరు విడుదల చేయాలని ఎమ్మెల్యే కోరగా ఈనెల 18 నుండి నీరు విడుదల చేస్తామని అధికారులు తెలిపారు. ధర్మ సముద్రం, కండ్ల పల్లి చెరువులకు సైతం నీరు విడుదల చేయాలని, గుట్రాజ్ పల్లి, గుల్లపెట్ లలో చెక్ డ్యాం లను త్వరిత గతిన పూర్తి చేయాలని అన్నారు. మన ఊరు మన బడి కార్యక్రమం లో భాగంగా బీట్ బజార్ ప్రైమరీ, ఓల్డ్ హై స్కూల్, గర్ల్స్ హై స్కూల్, ఫోర్ట్ హై స్కూల్ ఉర్దూ మీడియం లలో పనులను త్వరిత గతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశం లో ఎస్ ఈ శ్రీనివాస్, ఈఈ ఎ హెచ్ ఖాన్, డిఈ వాజిడ్ అలీ, తదితరులు ఉన్నారు.