ధాన్యాన్ని ఆరబెట్టి కేంద్రాలకు తీసుకురావాలి.. : జడ్పీటీసీ దిరిశాల ప్రమీల..
Published: Tuesday December 14, 2021
తల్లాడ, డిసెంబర్ 13 (ప్రజాపాలన న్యూస్): మండలంలోని రైతులు తమ ధాన్యాన్ని ఆరబెట్టినా తర్వాతనే కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని తల్లాడ జడ్పీటీసీ సభ్యురాలు దిరిశాల ప్రమీల సూచించారు. సోమవారం మండలంలోని బసవపురం గ్రామంలో ఆమె దాన్యం కొనుగోలు కేంద్రాన్ని టిఆర్ఎస్ పార్టీ జోనల్ చైర్మన్ దిరిశాల దాసురావుతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా తేమశాతాన్ని గమనించారు. రైతులు ప్రభుత్వ నిబంధనలతో వడ్లను తీసుకొచ్చి మద్దతు ధరతో అమ్మకాలు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వారి వెంట టిఆర్ఎస్ జోనల్ చైర్మన్ దిరిశాల దాసు రావు, రైతు సమన్వయ సమితి నాయకులు, రైతులు పాల్గొన్నారు.
Share this on your social network: