గర్భిణీలకు అవగాహన సదస్సు

Published: Wednesday March 24, 2021

వలిగొండ ప్రజాపాలన ప్రతినిధి మండల పరిధిలోని వేములకొండ గ్రామంలో మంగళవారం పోషణ పక్వాడ అవగాహన సదస్సులో భాగంగా అంగన్వాడీ-3 టీచర్ పి సువర్ణ, ఏ ఎన్ ఎం జె వినోద ఆధ్వర్యంలో పౌష్టికాహారంపై, పారిశుధ్యంపై, గర్భిణీలకు, బాలింతలకు, తల్లులకు అవగాహన కల్పించి వారు మాట్లాడుతూ పుష్టికరమైన ఆహారం తీసుకున్నప్పుడే పుట్టబోయే బిడ్డ ఆరోగ్యవంతంగా పుడతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్లు యం కృష్ణవేణి, జి రమలీల, ఎన్ నీరజ అంగన్వాడీ ఆయా వి వరమ్మ, కిశోరబాలికలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.