మోమిన్ కలాన్ మైనొద్దిన్ కుటుంబానికి ఆర్థిక చేయూత
Published: Monday September 06, 2021
ధారూర్ ఏఎంసి వైస్ చైర్మన్ రాజు గుప్తా
వికారాబాద్ బ్యూరో 05 సెప్టెంబర్ ప్రజాపాలన : గత పది రోజుల క్రితం సిద్దిపేట రోడ్డు ప్రమాదంలో మైనొద్దిన్ మృతి చెందాడని ఏఎంసి వైస్ చైర్మన్ రాజుగుప్తా సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ధారూర్ మండల పరిధిలోని మోమిన్ కలాన్ గ్రామానికి చెందిన మైనొద్దిన్ మృతి చెందిన విషయాన్ని తెలుసుకొని కుటుంబ సభ్యులను పరామర్శించానని పేర్కొన్నారు. కళ్ళముందు అనునిత్యం కనబడే వ్యక్తి ఇక ఎప్పటికీ కనబడడని శోకతప్త కుటుంబ సభ్యులను ఓదార్చి, 10 వేల రూపాయల ఆర్థిక సహకారం అందజేశానని అన్నారు.
బాధాతప్త కుటుంబాలకు ఎప్పటికీ అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు.
Share this on your social network: