ఉప్పల్ ప్రెస్ క్లబ్ వద్ద నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే సుభాష్ రెడ్డ

Published: Wednesday September 15, 2021
మేడిపల్లి, సెప్టెంబర్ 14 (ప్రజాపాలన ప్రతినిధి) : ఉప్పల్ గణేష్ నగర్ సర్ మౌంట్ పాఠశాల యాజమాన్య ప్రతినిధులు బాణాల విజయేందర్ రెడ్డి, శ్రావ్యరెడ్డి, తన్వీఇలా ఆధ్వర్యంలో ఉప్పల్ ప్రెస్ క్లబ్ గణేష్ మండపం వద్ద మంగళవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, ఉప్పల్ ఎమ్మార్వో గౌతమ్ కుమార్, ఉప్పల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆర్ గోవింద్ రెడ్డి, ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ గౌడ్ ఎస్సై జయరామ్, ప్రభుత్వ ఆస్పత్రి సూపర్ వైజర్ భోగ ప్రకాష్ తదితరులు పాల్గొని గణనాధునికి ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ అన్నదాన కార్యక్రమంలో తెరాస బిజెపి టిడిపి నాయకులు జనంపల్లి వెంకటేశ్వర్ రెడ్డి, మేకల  మధుసూదన్ రెడ్డి, బన్నాల  ప్రవీణ్ ముదిరాజ్, వేముల సంతోష్ రెడ్డి, ఆకుల మహేందర్ రెడ్డి, గుడి మధుసూదన్ రెడ్డి, పల్లె నర్సింగ్ రావు, వేముల పరమేష్, గోనె అర్జున్ రెడ్డి, చింతల నర్సింహా రెడ్డి సోమిరెడ్డి, షామీర్ పేట ధర్మా రెడ్డి, మహంకాళి లక్ష్మణ్, రావుల బాలక్రిష్ణ గౌడ్ రెడ్డిగారి దేవేందర్ రెడ్డి, రేవెళ్లి రాజు, మార్నేని ఫణీందర్, ఈగ విఠల్ రావు, చిలుకానగర్ డివిజన్ టీడీపీ అధ్యక్షులు పబ్బతి శేఖర్ రెడ్డి, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు దొంతుల వెంకట్రాం రెడ్డి, ప్రధాన కార్యదర్శి కూకుట్ల నరోత్తం రెడ్డి, కార్యనిర్వాహణ అధ్యక్షులు వేముల తిరుపతి రెడ్డి, ఉపాధ్యక్షులు మాదిరాజ్ సురేష్ కుమార్, పారెల్లి సాగర్, ఏవి శ్రీధర్, కార్యదర్శులు శివాజీ, దాసరాజు, అశోక్, కోశాధికారి యాదగిరి, ముఖ్య సలహాదారులు డి సురేష్, పల్లా మహేందర్ రెడ్డి, శ్రీనివాస్, రాజు సీనియర్ జర్నలిస్ట్ వడ్డేపల్లి కిషోర్ తదితరులు పాల్గొన్నారు.