కరెంటు కోతలతో, సాగర్ నీళ్లు రాక ఎండిపోతున్న మొక్కజొన్న, వరి పంటలు

Published: Tuesday February 28, 2023
మండల తాసిల్దారుకి బిజెపి నాయకులు విన్నత పత్రం
ఎర్రుపాలెం, ఫిబ్రవరి27 ప్రజా పాలన ప్రతినిధి మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయంలో బిజెపి మండల నాయకులు మండలంలో రైతులు పండిస్తున్న రబిసాగు మొక్కజొన్న, వరి, కూరగాయలు పంటలు  కరెంటు కోతలతో, సాగర్ నీళ్లు రాక పంటలు ఎండిపోతున రైతుల కష్టాలు పట్టించుకోని రాష్ట్రప్రభుత్వం నికి తెలియజేస్తూ మండల తాసిల్దార్ తిరుమలచారికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కిషన్ మోర్చా సభ్యులు నూతక్కి నరసింహారావు, మండల అధ్యక్షులు ముఖపాటి శ్రీనివాసరావు, దళిత మోర్చా జిల్లా కార్యదర్శి దేవరకొండ కోటేశ్వరావు, కిసాన్ మోర్చా జిల్లా కార్యదర్శి పుప్పాల చంద్రమౌళి, ఐటీ సెల్ మండల అధ్యక్షుడు పసుపులేటి రామకృష్ణ, ఓబీసీ మండలాధ్యక్షుడు వేములకొండ రాము, బిజెపి మండల ఉపాధ్యక్షుడు బొక్క రమేష్, ధనుంజయ శర్మ, కిషన్ మోర్చా మండల అధ్యక్షుడు మిరియల వెంకటేశ్వరరావు, మీనవోలు గ్రామ బిజెపి అధ్యక్షులు పురం గోపాల్రావు, పుప్పాల పుల్లయ్య, గుడేటి వెంకటేశ్వర్లు, పిల్లి కృష్ణ మండలంలో ఉన్న రైతులు, బిజెపి ప్రజాప్రతినిధులు మొదలు వారు పాల్గొన్నారు.