ఏ ఆర్ సి అడ్వాన్స్డ్ రీసెర్చ్ సెంటర్లో క్యాజువల్ ఉద్యోగాలు

Published: Monday October 11, 2021
బాలాపూర్: అక్టోబర్ 10, ప్రజాపాలన ప్రతినిధి : ఎక్కడ అన్యాయం జరుగుతుందో అక్కడ మీ శంకర్ రెడ్డి తోడుగా ఉండి నాయం జరిగే వరకు పోరాటం చెయ్యడం జరుగుతుందని అన్నారు. ఆదివారం బాలాపూర్ గ్రామ, ఏ ఆర్ సి అడ్వాన్స్డ్ రీసెర్చ్ సెంటర్లో భూములు కోల్పోయిన భూ బాధితుల సంఘం కమిటీ గడ్డం వెంకటేష్ మాజీ ఎంపీటీసీ ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు న్యాయవాది బాల్ లింగనీ  రాకేష్ కుమార్, బోర్ర రవికుమార్, నీరుడు శ్రీరాములు, తిమ్మిని గిరి, బిజెపి రాష్ట్ర నేత, మాజీ సింగిల్విండో చైర్మన్ కోలన్ శంకర్ రెడ్డి చొరవ వల్ల బీసీ కమిషన్ భారతీయ సభ్యులు తల్లోజు ఆచారి సహకారంతో బాలాపూర్ వారికి  తొమ్మిది మందికి కేంద్ర ప్రభుత్వ సంస్థ ఏ ఆర్ సి లో క్యాజువల్ వర్కర్గా లు గా ఉద్యోగాలు పెట్టించి నందుకు అలాగే, 30 సంవత్సరాలుగా వారి సమస్యల పరిష్కారం కొరకు ఉంటున్నందుకు కృతజ్ఞతగా బాలాపూర్ లో కోలన్ శంకర్ రెడ్డి స్వగృహంలో శాలువాతో ఘనంగా సన్మానించి స్వీట్ పంపించారు. ఈ సందర్భంగా కోలన్ శంకర్ రెడ్డి మాట్లాడుతూ.... ఎక్కడా ప్రజలకు అన్యాయం జరిగిందో అక్కడ శంకర్ రెడ్డి తప్పకుండా తోడుగా ఉండి న్యాయం జరిగే వరకు పోరాడటం జరుగుతుందని అన్నారు. భవిష్యత్తులో ప్రజల కోసం ఎప్పుడైనా సేవ చేయటానికి సిద్ధంగా ఉంటానని అన్నారు. నిరుపేద ప్రజలకు మనస్ఫూర్తిగా ధన్యవాదములు తెలియజేశారు.