తూటికుంట్ల గ్రామంలో పార్టీ ఫండ్ చెక్కు ను అందజేసిన జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు

Published: Saturday January 22, 2022
బోనకల్, జనవరి 21 ప్రజాపాలన ప్రతినిధి : మండల పరిధిలోని తూటికుంట్ల గ్రామానికి చెందిన గడ్డం వెంకటేశ్వర రావు  కుమారుడు ప్రశాంత్ గత సంవత్సరం మరణించినారు. వారికి టిఆర్ఎస్ పార్టీ సభ్యత్వం ఉన్నందువలన పార్టీ ఫండ్ చెక్కు రెండు లక్షల రూపాయలు మంజూరు అయినవి. ఈ చెక్కును జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు చేతుల మీదగా అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు చేబ్రోలు మల్లికార్జున రావు, జిల్లా కమిటీ సభ్యులు బంధం శ్రీనివాసరావు, మండల కార్యదర్శి మోదుగు నాగేశ్వరావు, రైతు బంధు సమితి కన్వీనర్ వేమూరి ప్రసాద్, మాజీ జెడ్పిటిసి బానోత్ కొండా, మండల కమిటీ సభ్యులు వెనిగళ్ళ మురళి, సాధినేని శ్రీనివాస్ రావు, తమ్మారపు బ్రహ్మం, గ్రామ అధ్యక్ష, కార్యదర్శి పాపినేని కృష్ణ, సురేంద్ర, రైతు గ్రామ కన్వీనర్ కంచర్ల అచ్చయ్య, వార్డు నెంబర్లు సుధాకర్, నాగేశ్వరరావు, పాపినేని రవి, గార్లపాడు అధ్యక్షులు రాజారావు, పెద్ద బీరవెల్లి కార్యదర్శి రెడ్డిపోయిన ఉద్దండు, గ్రామ కమిటీ సభ్యులు వెంకటేశ్వరరావు, తన్నీరు రామారావు తదితరులు పాల్గొన్నారు