మధిర నియోజకవర్గ ఆర్యవైశ్య సంక్షేమ సంఘం చైర్మన్ సభ్యుల ఎన్నికలు

Published: Wednesday September 22, 2021

మధిర, సెప్టెంబర్ 21, ప్రజాపాలన ప్రతినిధి : జిల్లా ఖమ్మం ఆర్యవైశ్య సంక్షేమ సంఘం అధ్యక్షులు సిద్ధం శెట్టి శ్రీకాంత్, ప్రధాన కార్యదర్శి కోదుమూరి భద్రయ్య, వెలంపల్లి వెంకట సుబ్బారావు, కేతపల్లి రాజేష్ లు ప్రకటించారు. ఈ సందర్భంగా మదిర నియోజకవర్గ ఆర్యవైశ్య సంక్షేమ సంఘం అధ్యక్ష కార్యదర్శులు మహంకాళి వెంకట శ్రీనివాస రావు, పరిశ శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆర్యవైశ్యుల అభ్యున్నతికి పాటు పడతామని ప్రభుత్వం సంక్షేమ పథకాలు పేద ఆర్యవైశ్యులకు అందేల కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా ఆర్యవైశ్య సంక్షేమ సంఘం కన్వీనర్ పల్లపోతు ప్రసాదరావు, మిరియాల కాశీ విశ్వేశ్వరరావు, యర్రా లక్ష్మణరావు, శ్రీ వాసవి ఆర్య వైశ్య కళ్యాణ మండపం అధ్యక్షులు కురువెళ్ళ కృష్ణ, ఇరుకుళ్ళ లక్ష్మీ నరసింహారావు, చారు గుండ్ల నరసింహమూర్తి, కొల్లా రామారావు, చల్లా సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు