పెరిగిన గ్యాస్ పెట్రోల్ డీజిల్ ధరలను నిరసిస్తూ ధర్నా

Published: Friday March 25, 2022
మేడిపల్లి, మార్చి 24 (ప్రజాపాలన ప్రతినిధి) : పెరిగిన గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను నిరసిస్తూ కేంద్ర ప్రభుత్వం వైఖరిని ఖండిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఉప్పల్ బస్ డిపో దగ్గర పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పాలకవర్గం ఆధ్వర్యంలో రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమంలో మేయర్ జక్క వెంకట్ రెడ్డి, డిప్యూటీ మేయర్ కుర్ర శివ కుమార్ గౌడ్, కార్పొరేటర్లు పప్పుల రాజేశ్వరి అంజిరెడ్డి, బండారి మంజుల రవీందర్, హరీశంకర్ రెడ్డి, కుర్ర శాలిని శ్రీకాంత్ గౌడ్, కో ఆప్షన్ మెంబెర్స్, సీనియర్ నాయకులు, మహిళలు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.