ఊట చెరువులో చేపలు పెంచుకొనుటకు వేలం
Published: Monday September 27, 2021
కెరెల్లి గ్రామ సర్పంచ్ కె.నర్సింహారెడ్డి, కార్యదర్శి రేవన్ గౌడ్
వికారాబాద్ బ్యూరో 26 సెప్టెంబర్ ప్రజాపాలన : ఊట చెరువులో చేపలు పెంచుకొనుటకు కెరెల్లి గ్రామ పంచాయతీ ఆవరణలో వేలం పాట నిర్వహించనున్నామని గ్రామ సర్పంచ్ కె.నర్సింహారెడ్డి, కార్యదర్శి రేవన్ గౌడ్ లు సంయుక్తంగా ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వికారాబాద్ జిల్లా పరిధిలోని ధారూర్ మండలానికి చెందిన కెరెల్లి గ్రామం, అనుబంధ గ్రామాలు కొండాపూర్ (కుర్దు), బాచారం గ్రామాల ప్రజలు వేలం పాటలో పాల్గొనాలని సూచించారు. ఆసక్తి గల ప్రజలు 1000 రూపాయలు ధరావత్తు చెల్లించి వేలం పాటలో పాల్గొనాలని పేర్కొన్నారు. 29 సెప్టెంబర్ 2021 బుధవారం ఉదయం 10.30 గంటలకు కెరెల్లి గ్రామ పంచాయతీ ఆవరణలో వేలం పాట నిర్వహిస్తామని స్పష్టం చేశారు.
Share this on your social network: