కెసిఆర్ భారత రాజ్యాంగాన్ని అవమాన పరిచే విధంగా మాట్లాడడం దుర్మార్గమైన చర్య

Published: Friday February 04, 2022
కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గాలి దుర్గారావు
బోనకల్, ఫిబ్రవరి 03 ప్రజాపాలన ప్రతినిధి : రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బోనకల్ ప్రధాన కూడలిలో అంబేద్కర్ విగ్రహం ముందు కెసిఆర్ దిష్టిబొమ్మను మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దహనం చేయడం జరిగింది.అలాగే అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేయడం జరిగింది. అనంతరం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాలి దుర్గారావు మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని అవమానపరిచే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడడం దుర్మార్గమైన చర్య అని,కేసీఆర్ యావత్ ప్రజలను మోసపూరిత హామీలతో మోసం చేయడమే కాక,అవమాన పరిచే విధంగా మాట్లాడిన తీరు పట్ల తక్షణమే రాష్ట్రపతి,గవర్నర్ జోక్యం చేసుకుని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.యూత్ నాయకులు భద్రు నాయక్ మాట్లాడుతూ నిరుద్యోగులకు కేసీఆర్ చేసిన మోసానికి ట్యాంక్ బండ వద్దగల అంబెడ్కర్ విగ్రహం దగ్గర ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పలని అన్నారు.ఈ కార్యక్రమంలో మండల పరిషత్ ఉపాద్యక్షులు గుగులోత్ రమేష్,మండల ఎస్సి సెల్ అధ్యక్షుడు మారుపల్లి ప్రేమ్ కుమార్,మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు భూక్య భద్రునాయక్,మండల సేవదల్ అధ్యక్షుడు చింతేటి సురేష్, మండల సోషల్ మీడియా కో ఆర్డినేటర్ డేగల వేలాద్రి,కాంగ్రెస్ పార్టీ నాయకులు జెట్టం పుల్లయ్య,యూత్ కాంగ్రెస్ నాయకులు జంగం రాజేష్,దారెల్లి రాకేష్,జనప్రియ కుమార్,చందు,వివిధ గ్రామాల కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.