మోడీ సభను విజయవంతం చేయాలి.. బీజేపీ మండల అధ్యక్షులు రామారావు..

Published: Thursday June 30, 2022
ల్లాడ, జూన్ 28 (ప్రజాపాలన న్యూస్): భారత ప్రధాని నరేంద్ర మోడీ జూలై 3వ తేదీన హైదరాబాదులో జరిగే బహిరంగ సభకు హాజరవుతున్నారని, ఈ సభను విజయవంతం చేయాలని బీజేపీ పార్టీ తల్లాడ మండల అధ్యక్షులు అపతి వెంకటరామారావు పిలుపునిచ్చారు. బుధవారం తల్లాడలో ఆ బహిరంగ సభకు సంబంధించిన కరపత్రాలను ఆయన ఆవిష్కరించారు. కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేసిందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో గాదె కృష్ణారావు, మధు, రమేష్, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.