డాక్టర్ అంబేద్కర్ ను ఆదర్శంగా తీసుకోవాలి.

Published: Tuesday December 07, 2021
తల్లాడ, డిసెంబర్ 6 (ప్రజాపాలన న్యూస్): భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అన్ని వర్గాల ప్రజలకు అందరివాడని తల్లాడ సొసైటీ చైర్మన్, టిఆర్ఎస్ మండల అధ్యక్షులు రెడ్డం వీరమోహన్ రెడ్డి అన్నారు. సోమవారం అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా స్థానిక సొసైటీ కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి ఆయన పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగాన్ని రచించి అన్ని వర్గాల ప్రజలకు మేలు జరిగే విధంగా ఉన్నాయని గుర్తుచేశారు. ఆ మహానుభావుని ప్రవేశపెట్టిన రాజ్యాంగాన్ని దేశంలో అనేక చట్టాలు, శాసనాలు నడుస్తున్నాయని పేర్కొన్నారు. అదేవిధంగా యువకుల అందరికీ ఓటు హక్కును కల్పించి ప్రజాస్వామ్యంలో ఓటుహక్కు వజ్రాయుధమని, దాని యొక్క గొప్పతనాన్ని వివరించారని తెలిపారు. ప్రతిఒక్కరూ ఆయన ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఉన్నతంగా ఎదగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులు దుగ్గిదేవర వెంకట్ లాల్, టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గరిడేపల్లి వెంకటేశ్వరరావు (జీవిఆర్), తెరాస బీసీ నాయకులు సరికొండ కస్తూరి రాజు, వార్డుమెంబెర్ తేళ్ళూరి రఘు, తదితరులు ఉన్నారు.