అంతర్జాతీయ తెలుగు సంబరాల్లో కవి గాయకులు మోదుగు గోవిందుకు పురస్కారం

Published: Tuesday January 11, 2022

వైరా:-పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో గజల్ మాంత్రికుడు గజల్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన అంతర్జాతీయ తెలుగు సంబరాల్లో స్థానిక మండలం పాలడుగు గ్రామానికి చెందిన కవి గాయకులు రచయిత మోదుగు గోవిందుకు పురస్కారం లభించింది. సాంప్రదాయాలపై ఆలపించిన గేయానికి సినీ రచయితలు రెంటాల వెంకటేశ్వరరావు, రసరాజు, నంది అవార్డు గ్రహీత సాధనాల వెంకటస్వామి నాయుడు, ప్రత్యేకంగా ప్రశంసించారు. గోవిందుకు సాహిత్య పురస్కారం లభించడం పట్ల ప్రజా నాయకుడు కంకణాల అర్జున్ రావు, ప్రముఖ న్యాయవాది డి.శిరీష, సాహిత్యవేత్తలు లెనిన్ శ్రీనివాస్, బుక్కా సత్యనారాయణ, మలిశెట్టి కృష్ణమూర్తి, కట్టేకోయిల చిన్న నరసయ్య, సాధనాల వెంకటస్వామి నాయుడు, ఎడవల్లి శైలజ, ఉరిమళ్ళ సునంద, గంజి భాగ్యలక్ష్మి, గాజుల భారతి, నెల్లుట్ల సునీత, సుబ్రహ్మణ్య కుమార్, తదితరులు అభినందించారు