సీఎం రిలీఫ్ ఫండ్ ఎల్ఓసి పత్రాన్ని లబ్ధిదారునికి అందజేసిన ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి
Published: Thursday November 10, 2022
మేడిపల్లి, నవంబర్ 9 (ప్రజాపాలన ప్రతినిధి)
హబ్సిగూడ డివిజన్ కు చెందిన జయదీప్ రెడ్డి గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ వైద్య ఖర్చుల నిమిత్తం ఆయన సీఎం రిలీఫ్ ఫండ్ కు దరఖాస్తు చేసుకోగా మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ ఎల్ఓసి రూ 2,50,000/ ఉత్తరువు పత్రాన్ని లబ్ధిదారుడికి ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు గరిక సుధాకర్, హబ్సిగూడ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ బి.వి చారి, ప్రధాన కార్యదర్శి కంచర్ల సోమిరెడ్డి, ఉపాధ్యక్షుడు రవీందర్ రెడ్డి, నంది కంటి శివ, కొంగల శ్రీధర్, సూరం శేఖర్, తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: