సీఎం రిలీఫ్ ఫండ్ ఎల్ఓసి పత్రాన్ని లబ్ధిదారునికి అందజేసిన ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి

Published: Thursday November 10, 2022
మేడిపల్లి, నవంబర్ 9 (ప్రజాపాలన ప్రతినిధి)

హబ్సిగూడ డివిజన్ కు చెందిన జయదీప్ రెడ్డి గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ వైద్య ఖర్చుల నిమిత్తం ఆయన సీఎం రిలీఫ్ ఫండ్ కు దరఖాస్తు చేసుకోగా మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ ఎల్ఓసి   రూ 2,50,000/ ఉత్తరువు పత్రాన్ని లబ్ధిదారుడికి ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి అందజేశారు. ఈ  కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు గరిక సుధాకర్, హబ్సిగూడ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ బి.వి చారి, ప్రధాన కార్యదర్శి కంచర్ల సోమిరెడ్డి, ఉపాధ్యక్షుడు  రవీందర్ రెడ్డి, నంది కంటి శివ, కొంగల శ్రీధర్, సూరం శేఖర్, తదితరులు పాల్గొన్నారు.