ఎల్ బి నగర్, భూపాలపల్లి నియోజకవర్గాల ఇంచార్జీగా నియామకం

Published: Tuesday February 21, 2023
* పీసీసీ ప్రధాన కార్యదర్శి పట్లోళ్ళ రఘువీర్ రెడ్డి 
వికారాబాద్ బ్యూరో 20 ఫిబ్రవరి ప్రజాపాలన : టిపీసీసీ అధ్యక్షుడు, మల్కాజ్ గిరి పార్లమెంట్ సభ్యుడు రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ నియోజక వర్గ ఇంచార్జీ లను ప్రకటించారని పీసీసీ ప్రధాన కార్యదర్శి పట్లోళ్ళ రఘువీర్ రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎల్ బి నగర్ తో పాటు భూపాల పల్లి నియోజక వర్గాల ఎన్నికల ఇంచార్జీగా నియమించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.