స్యయంగా ఉపాధి అన్వేషించడం అభినందనీయం
Published: Wednesday August 04, 2021
బొల్లారం, ఆగష్టు 03, ప్రజాపాలన ప్రతినిధి : యువత స్వయం ఉపాధి వైపు అడుగులు వేయడం శుభ పరిణామమని బొల్లారం మున్సిపాలిటీ టిఆర్ఎస్ యువత నాయకుడు యాదిరెడ్డి అన్నారు. మంగళవారం బొల్లారం సమీపంలోని మల్లంపేట బాలాజీ ఎంక్లేవ్ లో నూతనంగా ఏర్పాటు చేసిన చికెన్ సెంటర్ ని మై చారిటీ ఫౌండర్, టిఆర్ఎస్ యువత నాయకుడు యాదిరెడ్డి ప్రారంభోత్సవం చేశారు. యువకులు ఉపాధి అవకాశాలను స్వయంగా అన్వేషించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో వి వై ఆర్ యువసేన సభ్యులు, నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: