కార్తీకమాసం తొలి సోమవారం కావడంతో దేవాలయాల్లో నాగుల చవితి సందర్భంగా భక్తులు ప్రత్యేక పూజలు.

Published: Tuesday November 09, 2021
మధిర నవంబర్ ఎనిమిదో తేదీ ప్రజాపాలన ప్రతినిధి : మధిర శ్రీ మృత్యుంజయ స్వామి వారి దేవాలయంలో నేడు నాగుల చవితికార్తీక సోమవారం కావడంతో పట్టణంలోని మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్తీక దీపాలతో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. దానిలో భాగంగా ప్రతి సోమవారం శివాలయంలో మహా అన్నదాన కార్యక్రమంం జరుగుతుందని కమిటీ వారు తెలిపారు అయ్యప్పప స్వామి దేవాలయంలో మాలధారులు అన్నదాన కార్యక్రమం జరుగుతుందని తెలిపారు కార్యక్రమం ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో స్వామివారికి దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.