ఇబ్రహీంపట్నం డిసెంబర్ తేదీ 26 ప్రజాపాలన ప్రతినిధి *ప్రజా పాలన కాలమాని ఆవిష్కరణ*

Published: Tuesday December 27, 2022

ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శాసనసభ్యుడు మంచిరెడ్డి కిషన్ రెడ్డి చేతుల మీదుగా సోమవారం ప్రజా పాలన క్యాలెండర్ ను ఇబ్రహీంపట్నం జర్నలిస్టుల సమక్షంలో ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వార్తాపత్రికలు, న్యూస్ ఛానళ్లు ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా పనిచేస్తూ సమాచారాన్ని ఎప్పటికప్పుడు చేరవేస్తూ తన వంతు కర్తవ్యం గా కృషి చేస్తున్నాయని, ప్రజాస్వామ్యం లో  నాలుగవ పిల్లర్ గా పనిచేస్తున్న  పాత్రికేయుల సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో టి యు డబ్ల్యూ జే జిల్లా కార్యదర్శి గాదం రమేష్, ఇబ్రహీంపట్నం నియోజవర్గ అధ్యక్షుడు సురమోని సత్యనారాయణ,   జిల్లా జాయింట్ సెక్రెటరీ చెరుకూరు మహేందర్,  జిల్లా కోశాధికారి చెరుకూరి రాజు, హరికృష్ణ రెడ్డి,  పసునూరు వెంకటేష్,  చెరుకూరి మల్లేష్, సందీప్, అశోక్, తెంజు అధ్యక్షుడు పి. వెంకటేష్ కార్యదర్శి రవి, ట్రెజరీ పి. సుదర్శన్ తెంజు నియోజకవర్గ ఉపాధ్యక్షుడు పి. క్రాంతి కుమార్, లక్ష్మయ్య, దశరథ. సురేందర్,  కృష్ణ, నగేష్, దశరథ, సురముని బాబు, రాఘవేందర్, నరేందర్ రెడ్డి, కార్తీక్, మహేందర్ రెడ్డి, రామచందర్ డియా మిత్రులు పాల్గొన్నారు.