మాలమహానాడు నాయకులకు సన్మానం

Published: Monday May 24, 2021

బెల్లంపల్లి, మే 23, ప్రజాపాలన ప్రతినిధి : ఇటీవల రాష్ట్ర జిల్లా నాయకులుగా నియమించబడిన తెలంగాణ మాలమహానాడు నాయకులను ఆదివారం నాడు బెల్లం పల్లిలో ఘనంగా సన్మానించారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం లోని మాలమహానాడు పట్టణ కమిటీ సమావేశం స్థానిక అంబేద్కర్ భవన్లో ఆదివారం నాడు జరిగింది, ఈ సందర్భంగా ఇటీవల ఎన్నికైన రాష్ట్ర  మాలమహానాడు కార్యదర్శి కుసుమ మధు, రాష్ట్ర యువజన అధ్యక్షుడు ఆ సాది మధు, మంచిర్యాల జిల్లా అధ్యక్షులు కుంభాల రాజేష లను పట్టణ నాయకులు వారిని ఘనంగా సన్మానించారు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర నాయకత్వం మమ్మల్ని ఎంపిక చేసి బాధ్యతలు అప్పగించినందుకు ఆ బాధ్యతలు తప్పకుండా అమలు చేస్తూ మా యొక్క కార్యాచరనను మా వంతు బాధ్యతగా పూర్తి చేస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు నాయకులు కౌన్సిలర్ గోసికరమేష్, గీసరాజేశం, అంగురి సుభాష్,సుంకిత సమ్మయ్య, పొట్ట శేఖర్, వేముల గోపాల్, సిద్దిక్ నందు, పంబాల శ్రీను, రఘు, నవీన్, తదితరులు పాల్గొన్నారు.