శాఖాపూర్ కాంగ్రెస్ గ్రామ కమిటీ ఎన్నిక

Published: Saturday October 02, 2021
అధ్యక్షులు కొత్త హరీష్, కార్యదర్శి నేరెళ్ల రమేష్
మండల శాఖ అధ్యక్షులు తాటిపర్తి శైలేందర్ రెడ్డి
వెల్గటూర్, అక్టోబర్ 01 (ప్రజాపాలన ప్రతినిధి) : వెల్గటూర్ మండలం శాఖాపూర్ కాంగ్రెస్ గ్రామ కమిటీ అధ్యక్షులుగా కొత్త హరీష్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. శుక్రవారం రోజు లక్ష్మీనరసింహస్వామి వారి సన్నిధిలో శాఖ పూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ కమిటీ నీ ఎన్నుకోవడం జరిగినట్లు ఇందులో ప్రెసిడెంట్ గా కొత్త హరీష్ ను ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు అని ఆయన ఒక ప్రకటనలో తెలియజేశారు. వైస్ ప్రెసిడెంట్ గా పంజాల తిరుపతిని, ప్రధాన కార్యదర్శి నేరెళ్ల రమేష్, యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా ఎం.డి అప్సర్, వైస్ ప్రెసిడెంట్ గా రంగం సాయి కుమార్ (చింటూ) కాంగ్రెస్ పార్టీ మండల శాఖ అధ్యక్షులు తాటిపర్తి శైలందర్ రెడ్డి, వెల్గటూర్ సర్పంచ్ మెరుగు మురళి గౌడ్, గండ్ర శ్రీకాంత్ రావు, సందీప్ రెడ్డి, పుదేరి రమేష్, మెరుగు నరేష్, గుమ్ముల వెంకటేష్, లక్ష్మణ్, అన్నమనేని సత్యనారాయణ రావు, తిరుపతి, శశి పోశయ్య, సీనియర్ నాయకులు పంజాల నారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. శాఖాపూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తిప్పని రవి, చంద్రయ్య, ఎం.డి ఇమ్రాన్, తనుగుల కొమురయ్య, అశోక్, శీను, రమేష్, ఖాజామియా, జిడ్డు సాగర్, అమిత్, నేల తిరుపతి, ఆవునూరి అనిల్, గర్వందుల శ్రీకాంత్, జలీల్, హకీమ్, ఇబ్రహీం, మాడుగుల రవి, అనుమల శ్రీనివాస్, అసిఫ్, మణిదీప్, అప్సర్, బుర్ర సాయి చరణ్ గౌడ్, మధు, వినీత్ తదితరులు పాల్గున్నారు.