ఉచిత కంటి వెలుగు శిబిరాన్ని సద్వినియోగం చేసుకోండి.

Published: Friday February 10, 2023

 గ్రామ సర్పంచ్ మధిర రూరల్ ఫిబ్రవరి 9 ప్రజా పాలన ప్రతినిధి మండలం పరిధిలో సైదిలిపురం గ్రామంలో కంటి వెలుగు శిబిరాన్ని ప్రారంభించినసర్పంచ్ పులిబండ్ల చిట్టిబాబుతెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండో విడత కంటి వెలుగు కార్యక్రమ శిబిరాన్ని గ్రామంలో పంచాయతీ కార్యాలయ ఆవరణ నందు గురువారం గ్రామ సర్పంచ్ పులిబండ్ల చిట్టిబాబు ఎంపీడీవో విజయ్ భాస్కర్ రెడ్డితో కలిసి ప్రారంభించారు.కంటి సమస్యలు ఉన్న ప్రతి ఒక్కరూ ఉచిత కంటి వెలుగు శిబిరంలో పరీక్షలు చేయించుకొని కళ్లద్దాలను, మందులను ఉచితంగా పొందవచ్చు అన్నారు.దూరపు చూపు,దగ్గర చూపు సమస్యలు ఉన్న వారు కూడా పరీక్షలు చేయించుకొని అవసరమైన మందుల శిబిరంలో పొందవచ్చు అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్రీకాంత్, సూపర్వైజర్ భాస్కరరావు, వెలుగు సిసి మురళి, సిద్ధినేనిగూడెం సెక్రటరీ లక్ష్మీప్రసన్న, సైదిల్లీపురం సెక్రటరీ చిట్టెమ్మ, ఆశ వర్కర్లు,సిబ్బంది పాల్గొన్నారు.