అన్నదానం చేసిన శ్రీ భీమేశ్వర అన్నదాన సేవా సమితి

Published: Friday February 18, 2022

రాయికల్, ఫిబ్రవరి 17 (ప్రజాపాలన ప్రతినిధి) : రాయికల్ మండల కేంద్రంలో శ్రీ భీమేశ్వర స్వామి జాతర సందర్భంగా శ్రీ భీమేశ్వర అన్నదాన సేవా సమితి ఆధ్వర్యంలో శ్రీ భీమేశ్వర స్వామి ఆలయ ఆవరణలో అన్నదానం చేశారు. అనంతరం పాత్రికేయు లందరిని శాలువాలతో సన్మానించి భీమేశ్వర స్వామి ప్రసాదం ఆలయ అర్చకుడు దేవుని చిన్న రాజంచే అందించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పట్టణ ప్రజలు పాల్గొన్నారు అన్నదాన కార్యక్రమంలో శ్రీ భీమేశ్వర అన్నదాన సేవా సమితి అధ్యక్షుడు కల్లెడ హరీష్, ఆర్గనైజర్ కూనా రపు భూమేష్, నర్సయ్య, రెడ్డి, రాజం, శేఖర్ తదితరులు పాల్గొని భక్తులకు సేవలు అందించారు.