ప్రజాప్రతినిధులకు మరియు విలేకరులకు క్రికెట్ మ్యాచ్

Published: Monday January 24, 2022

కొడిమ్యాల, జనవరి 23 (ప్రజాపాలన ప్రతినిధి): జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం పూడూరు గ్రామంలో దివంగత ప్రియతమ నాయకులు పూడూరు ఎంపీటీసీ కీ.శే.శ్రీ అనుమాండ్ల రాఘవరెడ్డి (రఘు) స్మారక క్రికెట్ టోర్నమెంట్లో భాగంగా 22.01.2022 శనివారం రోజున మండల ప్రజాప్రతునిధులకు మరియు పత్రికావిలేఖరుల మధ్య (పొలిటికల్ టీం vs ప్రెస్ క్లబ్ టీం) జరిగిన క్రికెట్ మ్యాచ్ లో ప్రజాప్రతినిధుల జట్టు విలేఖరుల జట్టుపై గెలుపొందింది. ఈ మ్యాచ్ లో గాడిచెర్ల శ్రీకాంత్ రెడ్డి మ్యాన్ ఆఫ్ ధి మ్యాచ్ గా నిలిచారు. ఈ మ్యాచ్ లో ప్రజాప్రతినిధుల జట్టు తరపున సర్పంచుల ఫోరమ్ అధ్యక్షులు కృష్ణారావు కొడిమ్యాల సింగిల్విండో ఛైర్మెన్ రాజనర్సింగరావు  వైస్ ఎంపీపీ ప్రసాద్ ఇతర నాయకులు పాల్గొన్నారు.