ఇబ్రహీంపట్నం నవంబర్ తేదీ 23ప్రజాపాలన ప్రతినిధి *అక్షరం ఆరోగ్యం ఆర్దికస్వావలంబన ద్వారానే పేద

Published: Thursday November 24, 2022
ప్రతిజ్ఞ దివస్ ను పురస్కరించుకొని తుర్కయాంజల్ మున్సిపాలిటీ బహుజన సమాజ్ పార్టీ  శాఖ ఆధ్వర్యంలో తుర్కయాంజల్  చౌరస్తా లో తెలంగాణ రాష్ట్ర రథ సారధి డా౹౹ ఆర్. ఎస్ ప్రవీణ్ కుమార్  జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది, వద్దిగళ్ల బాబు   మాట్లాడుతూ ఎంతో ఉన్నతమైన ఐ పి ఎస్ ఉద్యోగానికి రాజీనామా చేసి పేదల బ్రతుకుల్లో వెలుగులు నింపడానికి బహుజన్ సమాజ్ పార్టీ  చేరి తెలంగాణ రాష్టంలో ప్రతి అన్యాయాన్ని  ప్రశ్నిస్తూ అసలైన ప్రతిపక్ష నాయకుడిగా ప్రవీణ్ కుమార్  ప్రజల గుండెల్లో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్నారు అని నిండు నూరేళ్లు జీవించి పేదలకు మరింత సేవ చేసే అవకాశాన్ని భగవంతుడు ఆయనకు ఇవ్వాలని అన్నారు.  ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితులు పన్నెండు మెట్ల కిన్నెర ప్రముఖ జానపథ కళాకారులు పద్మశ్రీ అవార్డు గ్రహీత దర్శనం మొగులయ్య గారు* హాజరయ్యారు  అనంతరం యాంజల్ గ్రామంలో ఉన్న అంగన్వాడి సెంటర్ లో కేక్ కోసి చిన్నారులకు పండ్లును పంచిపెట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి డా౹౹ యడవల్లి శ్యామ్, కోశాధికారి పట్నం రమేష్ కురుమ కార్యదర్శులు జంతుక సైదులు భూతం రమణ, కమ్మగూడా సెక్టార్ అధ్యక్షులు లపంగి రాజు, రాగన్న గూడ సెక్టార్ అధ్యక్షులు  బుద్దుల శ్రీనివాస  సీనియర్  నాయకులు మల్లెల బాలరాజు, స్వేరో నాయకులు మల్లెల బాలకృష్ణ, మల్లెల నర్సింహ,  అంగన్వాడి టీచర్ సుశీల,   తదితరులు పాల్గొన్నారు.,