చంద్రబాబు నాయుడుపై జరిగిన దాడిని ఖండించిన తెదేపా నాయకులు

Published: Monday September 20, 2021
బెల్లంపల్లి, సెప్టెంబర్ 19, ప్రజాపాలన ప్రతినిధి : తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణ తెదేపా నాయకులు రాజ్ కుమార్ పాండే, మని రామ్ సింగ్ లు అన్నారు. ఆదివారం నాడు స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాల పేద ప్రజల కోసం అహర్నిశలు పనిచేస్తున్న తెదేపా జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుపై వైసిపి గుండాలు జోగి రమేష్ అతని అనుచరులు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని వెంటనే వారిని అరెస్టు చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని తెదేపా రాష్ట్ర నాయకులు రాజ్ కుమార్ పాండే, టిఎన్టియుసి నాయకులు మనీ రామ్ సింగ్ అన్నారు. ఈ కార్యక్రమంలో రాజ్ కుమార్ పాండే మనీ రామ్ సింగ్, పట్టణ ఉపాధ్యక్షుడు బోల్లు మల్లయ్య, ఎండి హసన్, గంగాధర్ గౌడ్, సదానందం, విజయ్, అజయ్ శర్మ, హరికిషన్ పాండే, వెంకటేష్, ప్రకాష్, నరేందర్, గోపాల్, శంకర్, మధు, తదితరులు పాల్గొన్నారు.