వికారాబాద్ ఎంఆర్ఓగా బాధ్యతలు స్వీకరించిన క్రిష్ణయ్య

Published: Friday September 24, 2021
వికారాబాద్ బ్యూరో 23 సెప్టెంబర్ ప్రజాపాలన : వికారాబాద్ ఎంఆర్ఓ గా పదవీ బాధ్యతలను క్రిష్ణయ్య స్వీకరించారు. నాగర్ కర్నూల్ కలెక్టరేట్ లో తహశీల్దార్ గా విధులు నిర్వహించి వికారాబాద్ ఎంఆర్ఓ గా బదిలీ అయ్యారు. 2003లో వికారాబాద్ ఆర్డిఓలో జూనియర్ అసిస్టెంట్ గా ఉద్యోగంలో చేరారు. 2009లో సీనియర్ అసిస్టెంట్ గా తాండూరులో విధులు నిర్వహించారు. 2014లో పరిగిలో, 2017లో వికారాబాద్, డిప్యూటీ తహశీల్దార్ గా పని చేశారు. 2021లో నాగర్ కర్నూలుకు పదోన్నతిపై వెళ్ళారు. 2021 సెప్టెంబర్ లో నాగర్ కర్నూలు నుండి వికారాబాద్ ఎంఆర్ఓ గా బదిలీపై వచ్చారు.