క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న వైయస్సార్ తెలంగాణ పార్టీ నాయకురాలు కల్పన గాయత్రి

Published: Monday December 26, 2022
మేడిపల్లి, డిసెంబర్ 25 (ప్రజాపాలన ప్రతినిధి)
క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని 

వైయస్సార్ తెలంగాణ పార్టీ గ్రేటర్ హైదరాబాద్ మహిళా కోఆర్డినేటర్  కల్పన గాయత్రి ఆధ్వర్యంలో  ఉప్పల్ బీరప్పగడ్డ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం కేక్ కట్ చేసి స్వీట్స్ మరియు పండ్ల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కల్పన గాయత్రి  మాట్లాడుతూ వైయస్ షర్మిలమ్మ ఆదేశానుసారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చర్చిలో వైయస్సార్ తెలంగాణ పార్టీ శ్రేణులు ప్రార్థనలు జరిపి కేక్ కట్ చేసి క్రైస్తవ సోదర సోదరీమణులకు క్రిస్టమస్ శుభాకాంక్షలు తెలియజేశారు. రాబోయే రోజుల్లో వైయస్ షర్మిలమ్మను ముఖ్యమంత్రిని చేసే వరకు అహర్నిశలు కష్టపడి పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మహిళ నాయకురాలు నందిని ,నాగేంద్రమ్మ పాస్టర్ రాంబాబు, తండుభాస్కర్ గంగాధర్ యాదవ్,నవీన్ తదితరులు పాల్గొన్నారు.