శ్రీవారిని దర్శించుకున్న కార్పొరేటర్ బండి రమ్య సతీష్ గౌడ్

Published: Thursday July 22, 2021
మేడిపల్లి, జూలై21 (ప్రజాపాలన ప్రతినిధి) తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ 16వ డివిజన్ కార్పొరేటర్ బండి రమ్య సతీష్ గౌడ్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. పీర్జాదిగూడ కార్పొరేషన్ ప్రజలతో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని శ్రీవారిని కోరుకున్నట్లు కార్పొరేటర్ బండి రమ్య సతీష్ గౌడ్ తెలియజేశారు.