ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి ఘన సన్మానం

Published: Friday January 28, 2022
ఇబ్రహీంపట్నం జనవరి 27 ప్రజాపాలన ప్రతినిధి : టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి  కేసీఆర్ ఈరోజు రంగారెడ్డి జిల్లా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ నూతన రథసారధిగా ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ని నియమించడం పట్ల హర్షం వ్యక్తం చేసిన టిఆర్ఎస్ పార్టీవిద్యార్థి విభాగం టిఆర్ఎస్వి ఇబ్రహీంపట్నం నియోజకవర్గ అధ్యక్షులు నిట్టు జగదీశ్వర్. ఎమ్మెల్యే శ్రీ మంచిరెడ్డి కిషన్ రెడ్డి పైన నమ్మకంతో రంగారెడ్డి జిల్లా పార్టీ అధ్యక్షునిగా నియమించినందుకు గౌరవ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, సీఎం కేసీఆర్కి కి మరియు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి  కేటీఆర్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము అని, అనేకసార్లు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో అనేక పదవులు నిర్వహించారని ఎమ్మెల్యే శ్రీ మంచిరెడ్డి కిషన్ రెడ్డి సారథ్యంలో జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ మరింత బలోపేతం అవుతుందని, మండల వారీగా, గ్రామీణ స్థాయిలో ప్రతి ఒక్క కార్యకర్తలకు అందరికీ అందుబాటులో ఉండడం, పార్టీ, మరియు కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు అందేలా చేయడంలో మంచిరెడ్డికి ఎవరు సాటి లేరు అని, వారి మార్గ నిర్దేశకం లో జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేస్తూ ముందుకు తీసుకువెళ్తారూ అని ఈ సందర్భంగా టిఆర్ఎస్ పార్టీవిద్యార్థి విభాగం నాయకులూ ఇబ్రహీంపట్నం నియోజకవర్గ అధ్యక్షులు నిట్టు జగదీశ్వర్ తెలిపారు.