కండ్లపల్లి గ్రామ రైతువేదికలో వ్యవసాయంపై సలహాలు సూచనలు

Published: Wednesday February 24, 2021
బీరుపూర్, ఫిబ్రవరి 23 (ప్రజాపాలన ప్రతినిధి): జగిత్యాల జిల్లా బీరుపూర్ మండలం కండ్లపల్లి గ్రామంలో రైతు వేదికలో మండల వ్యవసాయ అధికారి అనూష సమావేశం నిర్వహించారు. వరి మొక్కజొన్న నువ్వు తదితర పంటల సాగులో చీడపీడల నుండి రక్షించుకోవడానికి రైతులకు సలహాలు సూచనలు చేశారు. వరిసాగులో సస్యరక్షణ మెలకువలు పురుగు మందులు వాడకం పీచుకారి చేసే పద్ధతులు తదితర అంశాలపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సమావేశంలో సర్పంచ్ పర్వతం రమేష్ వ్యవసాయ విస్తరణ అధికారులు సందీప్ శిరీష రైతులు తదితరులు పాల్గొన్నారు.