విద్యుత్ పనులు సకాలంలో పూర్తి చేయాలని : మేయర్ జక్క వెంకట్ రెడ్డి

Published: Tuesday August 24, 2021
 మేడిపల్లి, ఆగస్టు 23 (ప్రజాపాలన ప్రతినిధి) పీర్జాదిగూడ మున్సిపల్ కార్పోరేషన్లో పెండింగ్లో ఉన్న విద్యుత్ పనులను సకాలంలో పూర్తి చేయాలని మేయర్ జక్క వెంకట్ రెడ్డి విద్యుత్ అధికారులకు సూచించారు. మేడిపల్లిలోని కార్పొరేషన్ కార్యాలయంలో విద్యుత్  డిపార్ట్మెంట్ అధికారులతో మేజర్ వెంకట్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా స్తంభాల షిఫ్టింగ్, నూతన స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్స్ ఏర్పాటు మరియు లూస్ వైరింగ్ మొదలగు పనులపై చర్చించారు. వివిధ ఎలక్ట్రికల్ పనుల నిమిత్తం మున్సిపల్ నిధుల నుండి డిడి రూపేణా చెల్లింపులు జరిగిన పనులు ఎన్ని పూర్తి అయినవి, మిగిలిన పనులు ఏ స్తాయిలో ఉన్నవి, ఎంతవరకు వచ్చినవి అని అడిగి తెలుసుకున్నారు, మిగిలిన పనులు సకాలంలో పూర్తి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమీషనర్ శ్రీనివాస్, ఎలక్ట్రికల్ డిఈ భాస్కర్ రావు, ఏడిఈ శ్రీనివాస్ రెడ్డి, ఏఈ రాం రెడ్డి, వెంకటేశ్వర్లు, మున్సిపల్ ఏఈ వినీల్, ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్లు తదితరులు పాల్గొన్నారు.