కళ్యాణలక్ష్మీ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే
Published: Thursday May 06, 2021
బీరుపూర్, మే 05 (ప్రజాపాలన ప్రతినిధి): బీరుపూర్ మండలానికి చెందిన 24 మంది ఆడపడుచులకు బీరుపూర్ రైతు వేదిక ప్రాంగణంలో 24 లక్షల 02 వేల రూపాయల విలువగల చెక్కులను మరియు సీఎం సహయనిధి నుండి మంజూరు అయిన 53 వేల రూపాయల విలువ గల చెక్కులను ఎమ్మెల్యే డా.సంజాయ్ కుమార్ పంపిణీ చేశారు. అనంతరం కందేనకుంట గ్రామంలో వరిదాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ అరిఫోద్దీన్ ప్యాక్స్ చైర్మన్ ముప్పాల రాంచందర్ రావు నారపాక రమేష్ సర్పంచులు ఘర్షకుర్తి శిల్పరమేష్ గుడిసె శ్రీమతి రిక్కల ప్రభాకర్ ఆసునూరి భీమక్క ఏసుదాసు పర్వతం రమేష్ మహిపాల్ రెడ్డి నాయకులు ముక్క వెంకన్న వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Share this on your social network: