జడ్పీ చైర్పర్సన్ దావ వసంతసురేశ్ ను కలిసిన గుడాల రాజేష్ గౌడ్
Published: Thursday July 22, 2021
జగిత్యాల, జూలై 21 (ప్రజాపాలన ప్రతినిధి) : జగిత్యాల జడ్పీ చైర్ పర్సన్ దావ వసంతసురేశ్ ను జడ్పీ క్యాంపు కార్యాలయంలో మంగళవారం రోజున ప్రముఖ వ్యాపార వేత్త గుడాల రాజేష్ గౌడ్ మర్యాదపూర్వకంగా కలిశారు. టిఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న ప్రజా సంక్షేమ పథకాల కార్యక్రమాలకు ఆకర్షితులై గురువారం రోజున ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో తెరాసలో చేరిన సంగతి తెలిసిందే. అనంతరం జడ్పీ దంపతులకు పుష్పగుచ్చం అందజేసి శాలువాతో రాజేష్ గౌడ్ సత్కరించారు.
Share this on your social network: