జానపద గాయకురాలు కుమ్మరి దుర్గవ్వ ను సన్మానించిన ఎమ్మెల్యే

Published: Saturday December 11, 2021
బెల్లంపల్లి డిసెంబర్ 10 ప్రజాపాలన ప్రతినిధి : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గం లోని కోటపల్లి మండలం రొయ్యల పల్లి గ్రామానికి  చెందిన కుమ్మరి దుర్గవ్వకు సినీ పరిశ్రమలో అగ్రహీరోగా వెలుగొందుతున్న పవన్ కళ్యాణ్  నటించిన బీమ్లా నాయక్ సినిమాలో పాట పాడే అవకాశం రావడం ఎంతో అభినందనీయమని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం నాడు బెల్లంపల్లి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో దుర్గవ్వను ఘనంగా శాలువా కప్పి సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మంచిర్యాల జిల్లాలోని మారుమూల ప్రాంతంలో ఉన్న నేతకాని కులానికి చెందిన జానపద గాయకురాలు కుమ్మరి దుర్గవ్వ గొంతును సినిమా వర్గాలు గుర్తించి అవకాశం కల్పించడం ఎంతో గర్వించదగ్గ విషయమని రానున్న రోజుల్లో దుర్గవ్వకు మరిన్ని అవకాశాలు వచ్చి మరిన్నిపాటలు పాడి జిల్లాకే గర్వకారణం కావాలని ఆయన అన్నారు. అనంతరం తన కుటుంబసభ్యులతో కలిసి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ తోంగల సత్యనారాయణ, బెల్లంపల్లి ఎంపీపీ గోమాస శ్రీనివాస్, వైస్ ఎంపీపీ రాణి-సురేశ్, ఆకెనపల్లి ఎంపీటీసీ పొట్లపల్లి సుభాష్ రావు, బెల్లంపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మోటపలుకుల రాజశేఖర్, కౌన్సిలర్లు గెల్లి రాయలింగు, బొడ్డు నారాయణ, తాండూరు జడ్పీటీసీ సాలిగామ బాణయ్య, తెరాస పార్టీ నాయకుడు మల్లేష్, నేతకాని సంఘం నాయకులు రాజేష్, యువరాజ్, వెంకటి, తదితరులు పాల్గొన్నారు.