*షర్మిల పర్యటనను విజయవంతం చేయండి*వైయస్సార్ టిపి ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు మధిర నియోజకవర్

Published: Thursday December 15, 2022
మధిర డిసెంబర్ 14 ప్రజా పాలన ప్రతినిధి
 ఖమ్మం పట్టణంలోని కరుణగిరి వద్ద వైయస్సార్ తెలంగాణ పార్టీ కార్యాలయం శంకుస్థాపనకు ఈనెల 16వ తేదీన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల ఖమ్మం రానున్నారని ఆ పార్టీ దళిత విభాగం జిల్లా అధ్యక్షులు మధిర నియోజకవర్గ కోఆర్డినేటర్ డాక్టర్ మద్దెల ప్రసాదరావు తెలిపారు. బుధవారం మధిరలో నియోజకవర్గం లోని వైయస్సార్ టిపి మండల అధ్యక్షులతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 16వ తేదీన ఉదయం 9 గంటలకు మధిర నియోజకవర్గం లోని పార్టీ ముఖ్య నాయకులందరూ ఖమ్మంకు హాజరై షర్మిలమ్మకు ఘనస్వాగతం పలకాలని ఆయన కోరారు. అనంతరం ఉదయం 10 గంటలకు షర్మిలమ్మ చేతుల మీదుగా కరుణగిరి వద్ద పార్టీ కార్యాలయానికి శంకుస్థాపన చేయటం జరుగుతుందన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా కోఆర్డినేటర్ గడిపల్లి కవిత జిల్లా అధ్యక్షులు లక్కినేని సుధీర్ ఆధ్వర్యంలో షర్మిల పర్యటన విజయవంతం కోసం ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారని ఆయన తెలిపారు. షర్మిలమ్మ చేతుల మీదుగా కరుణగిరి వద్ద జరిగే భూమి పూజ కార్యక్రమానికి  మధిర నియోజకవర్గంలో వైయస్సార్ పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయవలసిందిగా ఆయన కోరారు. ఈ సమావేశంలో చింతకాని, ముదిగొండ, మధిర, బోనకల్లు ఎర్రుపాలెం మండల అధ్యక్షులు వాకా వీరారెడ్డి, సామినేని రవి, ఐలూరి ఉమామహేశ్వర రెడ్డి, షేక్ మౌలానా, వేమిరెడ్డి మల్లారెడ్డి పాల్గొన్నారు.