వరద బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ

Published: Monday July 18, 2022
జన్నారం జూలై 17, ప్రజాపాలన : మంచిర్యాల జిల్లా జన్నారం మండలం పొనకల్ గ్రామ పంచాయతీ పరిధిలో బుడగ జంగ్గల కాలనీలో ఎడతెరుపు లేకుండా కురిసిన వర్షాల వరద బాధితులు నష్ట పోయిన కుటుంబాలను పరామర్శించడం జరిగిందని మండల యువజన కాంగ్రెస్ నాయకుడు ఇమ్రాన్ సయ్యద్ ఆదివారం అన్నారు, ఈ సందర్భంగా మాట్లాడుతూ వరద బాధితులకు కుటుంబాలకు తొమ్మిది రకాల నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగిందన్నారు, ముంపునకు గురైన కుటుంబముల బాధితులు  ఎదుర్కోటుంన్న సమస్యలను తెలుసుకొని వాటిని పరీక్షించే ల ప్రభుత్వానికి ఒత్తిడి చేస్తామని తెలిపారు, ముంపు కుటుంబాలు పడిన వర్షాలకు వారు అనుభవించిన బాధలు, వర్ణనాతీతం బారీ వర్షాలకు ఇంటి సామగ్రి వరదల్లో కొటుకో పోవడం జరిగిందని బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు, ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ నాయకులు రోహిదస్ తదితరులు పాల్గొన్నారు.