* ఫ్లై ఓవర్, బైపాస్, ఇస్లాంపూర్ రోడ్లు వెంటనే మరమ్మత్తు చేయాలి. సి పి ఎం పార్టీ నాయకుల డిమాండ్

Published: Thursday January 05, 2023
మంచిర్యాల టౌన్, జనవరి 04, ప్రజాపాలన :  జిల్లా కేంద్రంలోనీ ఫ్లై ఓవర్, బైపాస్, ఇస్లాంపూర్ రోడ్లు వెంటనే మరమ్మత్తు చేయాలని భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) జిల్లా కార్యాలయంలో జనవరి 7 న జరుగు రాస్తారోకో  పై బుధవారం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సంకె రవి  మాట్లాడుతూ జిల్లా కేంద్రంలోని రోడ్లు ప్రమాదకారంగ ఉన్న, రోజు ప్రమాదాలు జరుగుతున్నా ప్రభుత్వం,అధికారులు పట్టించుకోవడం లేదని అన్నారు. జనవరి 7 న జరుగు రాస్తారోకో ప్రజలు విజయవంతం చేయాలని కోరారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రోడ్లు వెయ్యాలని డిమాండ్ చేశారు. లేని యెడల పలు ఆందోళన కార్యక్రమాలు చేస్తాం అని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో దాసరి రాజేశ్వరి,గోమాస ప్రకాష్ సిపిఎం జిల్లా కార్యదర్శి  దుంపల రంజిత్ కుమార్, సిపిఎం జిల్లా కమిటి సభ్యులు,కే. ప్రేమ్ కుమార్ సి పి ఎం పట్టణ నాయకులు తదితరులు పాల్గొన్నారు.