నూతన మంచి నీటి పైపులైన్ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

Published: Thursday May 27, 2021

పటాన్ చేరు, ప్రజాపాలన ప్రతినిధి : సూమరు నాలుగున్నర కోట్ల రూపాయల అంచనా వ్యయంతో పటాన్ చేరు పట్టణంలో  చేపట్టనున్న నూతన మంచి నీటి పైపులైన్ నిర్మాణ పనులకు స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి బుధవారం శంకుస్ధాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ పట్టణంలో 40 సంవత్సరాల క్రితం ఏర్పాటుచేసిన పైప్ లైన్ కి తరచు లీకేజీలు ఏర్పడటం మూలంగా సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడుతుందని తెలిపారు. ఈ అంశంపై జలమండలి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లగా, నాలుగున్నర కోట్ల రూపాయలు మంజూరు చేశారు. ప్రస్తుతం పటాన్చెరు పట్టణ పోలీస్ స్టేషన్ నుండి టోల్ గేట్ వద్ద గల జలమండలి కార్యాలయం వరకు నూతన పైప్ లైన్ నిర్మాణం చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. రెండో దశలో నక్క వాగు నుండి పోలీస్ స్టేషన్ వరకు పైపులైన్ ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, డీఎస్పీ భీమ్ రెడ్డి, సిఐలు వేణుగోపాల్ రెడ్డి, శ్రీనివాస్, జలమండలి ఉన్నతాధికారులు, పిఎసిఎస్ చైర్మన్ రాఘవేందర్ రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ కుమార్ గౌడ్, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి, పార్టీ పట్టణ అధ్యక్షులు అఫ్జల్, పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.