సీసీ రోడ్డు కు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే

Published: Wednesday November 09, 2022

జన్నారం, నవంబర్ 08, ప్రజాపాలన:: మంచిర్యాల జిల్లా జన్నారం మండలం ఇందనపల్లి గ్రామంలో సిసి రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేసి పనులను మంగళవారం ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానిక గ్రామంలో అర్హులైన వారికి సీఎం రిలీఫ్ ఫండ్ లబ్ధిదారులకు ఆమె చెక్కులు పంపిణీ చేశారు. నూతన టిఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన సుల్వ జనార్దన్ ను సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ  హయంలో గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని, గ్రామాలు అభివృద్ధి చెందాలంటే ఒక్క టీఆర్ఎస్ తోనే సాధ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సాగే శ్రీవాణి విక్రమ్, వైస్ ఎంపీపీ సుతారి వినయ్, మండల కోఆప్షన్ సభ్యుడు మున్వర్ అలీ ఖాన్, ఏఎంసి వైస్ చైర్మన్ రాజేష్ యాదవ్, మాజీ చైర్మన్ ముత్యం సతీష్, జిల్లా అధికార ప్రతినిధి భరత్ కుమార్, మొర్రిగూడ సర్పంచ్ గోపాల్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.