గచ్చిబౌలి డివిజన్ అభివృద్ధి కి సహకరించాలని ఎంపీ కి వినతిపత్రం.. కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి

Published: Friday January 21, 2022
శేరిలింగంపల్లి -ప్రజాపాలన (జనవరి 20) : నియోజకవర్గంలోని గచ్చిబౌలి డివిజన్ అభివృద్ధి కి నిధులు మంజూరు చేసి సహకరించాలని కోరుతూ గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి చేవెళ్ల ఎంపీ డాక్టర్ రంజిత్ రెడ్డి కి వినతిపత్రం అందజేశారు. గోపన్ పల్లి తాండ, ఎన్ టి ఆర్ నగర్ లలో నుతన కమ్యూనిటీ హాళ్ల నిర్మాణానికి, గచ్చిబౌలి డివిజన్ లోని గోపన్ పల్లి లోని మెట్లకుంటా చెరువు, నానక్ రాం గూడలోని భగీరమ్మ చెరువులను ఆధునికరించి పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దడానికి తమవంతు కృషిచేయాలని వినతి పత్రంలో కోరాను అని డివిజన్ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో నిత్యం పర్యటిస్తూ ప్రజల సమస్యలు తెలుసుకొంటు అధికారుల దృష్టికి తీసుకెళ్తు పరిష్కారం కోసం తన శాయ శక్తుల కృషి చేస్తున్నానని గంగాధర్ రెడ్డి గారు చేవెళ్ల ఎంపీ డాక్టర్ రంజిత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. అందుకు చేవెళ్ల ఎంపీ డాక్టర్ రంజిత్ రెడ్డి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి ని అభినందిస్తూ ఇదే స్ఫూర్తితో ముందుకు వెళ్లాలని, తాను ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటూ డివిజన్ అభివృద్ధికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు అని గంగాధర్ రెడ్డి తెలిపారు, కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షుడు హనుమంతు నాయక్, గచ్చిబౌలి డివిజన్ వైస్ ప్రెసిడెంట్ తిరుపతి, ఎన్టీఆర్ నగర్,తాజ్ నగర్, సోఫా కాలనీ సొసైటీ అధ్యక్షులు బి విటల్, గోపనపల్లి వడెర సంఘం ప్రెసిడెంట్ అలకుంట శ్రీరామ్, ఎన్టీఆర్ నగర్, తాజ్ నగర్, సోఫా కాలనీ సొసైటీ ఆర్గనైజింగ్ కార్యదర్శి నాగ సుబ్రహ్మణ్యం, సీనియర్ నాయకులు, దేవేందర్ రెడ్డి, హరీష్ శంకర్ యాదవ్,కిషన్ గౌలి,అరుణ్ గౌడ్,శ్రీనివాస్ రెడ్డి,మన్నే రమేష్,రంగస్వామి,గోపాల్,జితేందర్ సింగ్ ,రాజు, శ్రీను, యాదగిరి, నరేందర్, నరేష్,తదితరులు పాల్గొన్నారు